Wednesday 5 December 2012

తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతిలో తెలుగు మహాసభలు కోసం సిద్ధం చేస్తున్న అవిలాల చెరువు భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయింది. దీంతో సభల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సభల్ని వాయిదా వేయాలని నిర్వహకులు కోరుతున్నారు. 

కాగా సీఎం సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల వాయిదాపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు వేదిక మార్పును పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment